అయోధ్య రామ మందిర విగ్రహా ప్రతిష్టాపనలో భాగంగా పట్టణంలో విద్యార్థులు మానవహారం… శ్రీ రామ స్మరణం

0
12 Views

వికారాబాద్: ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీ రాముల వారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం ఉండడంతో అందులో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పట్టణంలో మానవహారం నిర్వహించారు. చేతిలో శ్రీ రాముని జెండాలను పట్టుకున్న విద్యార్థులు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అంటూ స్మరిస్తూ రామ భక్తిని చాటుకున్నారు. దీంతో వికారాబాద్ ప్రాంతం మొత్తం శ్రీ రామ నామ స్మరణతో నిండిపోయింది. వందలాది మంది విద్యార్థులు ఏ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటు కున్నారు.