నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రిలో బయటి రోగులకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
8 Views

వికారాబాద్: నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రిలో బయటి రోగులకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో సందర్శించి కాంట్రాక్టర్, అధికారులతో పనులపై కలెక్టర్ ఆరా తీశారు. వారం రోజుల్లోగా బయటి రోగులకు సేవలు అందించే దిశగా ఏర్పాట్లను సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ లో రోగులకు సేవలు అందించేందుకు సదుపాయాల సమకూరుస్తూనే , మిగతా పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ పనులను వెంటనే పూర్తి చేసి ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ తో పాటు వికారాబాద్ మండల తహసిల్దార్ లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది ఉన్నారు.