అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కేసు నమోదు: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
32 Views

వికారాబాద్: మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటి రెడ్డి, IPS తెలిపారు.అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.బైరీ నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ నందు cr. No.185/2022 u/s 153(A), 295(A),298, 505(2) IPC లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదన్నారు.ఇలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘాతం కలగచేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.