ఖరీఫ్ కు సంబంధించిన సిఎంఆర్ రైస్ టార్గెట్ వారం రోజుల్లోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
15 Views

వికారాబాద్:ఖరీఫ్ కు సంబంధించిన సిఎంఆర్ రైస్ టార్గెట్ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు.శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖరీఫ్ కు సంబంధించిన సీఎంఆర్ టార్గెట్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు నిర్దేశించిన టార్గెట్ కు అనుగుణంగా ఖరీఫ్ టార్గెట్లను పూర్తిచేసి అందజేయలన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ కలిసికట్టుగా, అందరూ ఒకరిని ఒకరు కలుపుకుంటూ టార్గెట్ ను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ చూపాలి అని  సూచించారు. రైస్ మిల్లర్లు అందరూ జిల్లాను యూనిట్ గా తీసుకొని పనిచేయాలని తెలిపారు. మిల్లర్లు తమ టార్గెట్ ను పూర్తి చేయనట్లయితే చర్యలు తప్పవని అన్నారు. పౌరసరఫరాల అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనులు చేపట్టాలన్నారు. రైస్ మిల్లర్లు, అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు లాభం జరిగే క్రమంలో జిల్లా యంత్రాంగం, తమ సహకారం కచ్చితంగా ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా పౌరసరఫరాలాధికారి రాజేశ్వర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.