ఈనెల 23న పరిగిలో మెగా జాబ్ మేళా:జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్

0
15 Views

వికారాబాద్:నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించించెందుకు గాను పరిగి పట్టణంలో ఈనెల 23 ( మంగళవారం) ఉదయం 10:00 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ 50 కంపెనీలలో 5 వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను పరిగి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెం. 1 లో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్ ఎస్ సి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, ఎంబీఏ, ఎంసీఏ, బి ఈ, బిటెక్ విద్యార్హతలు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హత మేరకు ఉపాధి పొందాలని ఆయన సూచించారు. వైద్య రంగం, మార్కెటింగ్, భవన నిర్మాణరంగం, రిటైల్, ఫైనాన్స్, అకౌంట్స్ ఇలాంటి ప్రైవేట్ రంగాలలో పరిశ్రమల యాజమాన్యాలు వారికి అవసరమైన సిబ్బందిని ఎంపిక చేసుకోనున్నారని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ ను 9676047444, 9182477163, 6305197076 నెంబర్లకు సంప్రదించాలన్నారు.