దమ్ముంటే ఈ సారి నా మీద పోటీ చేసి గెలువు – రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్

0
14 Views

వికారాబాద్: దమ్ముంటే ఈ సారి నా మీద పోటీ చేసి గెలువాలని  రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజులుగా పర్యటన పేరుతో కొడంగల్ కు వచ్చిన రేవంత్ రెడ్డి  అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు . నీకు పని చేయడం చేతకాదని కొడంగల్ నియోజకవర్గం ప్రజలు నిన్ను తరిమికొట్టారన్నారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేయకుండా కుట్ర పన్నింది నీవు, ఈరోజు కొడంగల్ నియోజకవర్గంన్నీ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్  దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి ఏం జరిగిందని కళ్ళు తెరిచి చూడాలన్నారు. మా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావన్నారు.  ఎక్కడ నీ వునికి కోల్పోతావని ప్రతిక్షణం భయపడుతూ జీవిస్తున్నావని తెలంగాణలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లను తరిమికొట్టిన ఘనత నీదన్నారు. ఎక్కడపడితే అక్కడ బ్లాక్మెయిల్ చేసి దందా నడిపించాలని మనస్తత్వంతో ఉన్న నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు సమాధి కడతారు. అభివృద్ధి చేయడం చేతకాదు గాని ఏదో షోపు టప్పుకు, పది కార్లు వేసుకొని వచ్చి హల్చల్ చేయడం తప్ప నీకు ఏమీ రాదన్నారు. దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో ఈసారి నాపై పోటీ చేసి గెలిచి చూపించాాలన్నారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు*