వికారాబాద్ లో విశ్వహిందు పరిషత్ ఆత్మీయ సమ్మేళనం

0
220 Views

వికారాబాద్:1964లో ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు సునీత రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. శ్రీ కృష్ణ జయంతి రోజు ప్రారంభమై వందకు పైగా దేశాలకు విస్తరించిందని తెలిపారు. నేడు లక్షలాది మంది కార్యకర్తలు కలిగి ధర్మాచార్యుల ఆశీస్సులతో నిరంతరం వికిసిస్తుందన్నారు. హిందూ ధర్మ పటిష్టతకు పని చేస్తుందని రామ జన్మ భూమి ఆయోద్య రామ మందిరానికి హిందూ జాతి తరలి వచ్చిందన్నారు. దేశంలో హిందువులు ఐక్యంగా ఉంటూ ధర్మస్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సతీష్ గౌడ్, నగర కార్యదర్శి ధన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.