ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

0
23 Views

అనంతగిరి డెస్క్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచారీ పూర్తి చేశాడు. ఓపెనర్ గా శిఖర్ దావన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇషాన్ ధావన్ త్వరగా అవుట్ అయిన విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్ది కేవలం  85 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు తరువాత 100 పరుగులకు 41 బంతుల్లోనే పూర్తి్తి చేశాడు.  126 బంతుల్లో 200 పరుగులు చేసిన ఇషాన్ 9 సిక్సులు 23 ఫోర్లు కొట్టాడు. 131 బంతుల్లో 210 రన్స్ చేసి అవుటు కాగా కోహ్లి 85 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోర్ 36 ఓవర్లలోనే 305 పరుగులు చేరుకుంది .