ఏబీవీపీ వికారాబాద్ టౌన్ కమిటీ ఎన్నిక

0
11 Views

వికారాబాద్: ఏబీవీపీ వికారాబాద్ నూతన టౌన్ కమిటీని సంఘ కార్యాలయంలో శనివారం ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విభాగ్ కన్వీనర్ నరేష్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ , దేశం కోసం కూడా పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్న ఏబీవీపీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నూతన టౌన్ సెక్రటరీగా మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ జగదీష్,  అనిల్, ఉపాధ్యక్షులు గోపీచంద్, శివప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ కార్తీక్ సంజీవ్ వెంకటేష్ మరియు రాష్ట్రీయ కళామంచ్ వెంకటేష్ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మంజునాథ్ రెడ్డి, కో కన్వీనర్ అరుణ్ ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ బి మురళి ఎస్ ఎఫ్ ఎస్ కో కన్వీనర్ ప్రశాంత్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరీష్ రావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి గణేష్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.