రేపు డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం రద్దు

0
14 Views

వికారాబాద్: రేపు జరగబోయే డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం తాత్కాలికంగా రద్దు  చేయడం జరుగుతుందని  వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్  జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న సందర్భంగా, దేశ ప్రజల తలరాతలు మార్చడానికి నూతనంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ జాతీయ పార్టీ కి మద్దతుగా రేపు అనగా సోమవారం నాడు హైదరాబాద్ లోని మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ లో మున్సిపల్ చైర్మన్ ల అత్యవసర సమావేశం ఉన్నందున.. వికారాబాద్ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమాన్ని ఈవారం తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుందని, వచ్చేవారం నుంచి యధావిధిగా కొనసాగుతుందని  ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి పట్టణ ప్రజలు గమనించగలరు.