16 Views
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థకు గురయ్యారు. పెద్దేముల్ (మం) మారేపల్లి కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతోః11 మంది విద్యార్థినీలకు అస్వస్థత గురికాగా వాంతులు,విరోచనాలతో చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 7గురు విద్యార్థినీలు కోలుకున్నారు. మరో 4 గురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.